Home » Puttaparthy
మండలపరిధిలోని గుత్తివారిపల్లి వద్దనున్న సాగర్ సిమెంటు గోడౌనపై విజిలెన్స ఎనఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడిచేసి గోడౌనను సీజ్ చేశారు. గుత్తివారిపల్లి వద్ద కొన్నేళ్లుగా కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తి సాగర్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా దిగుమతులు, ఎగుమతులు సాగిస్తున్నారు.
పెనుకొండ సమీపంలో ఐదు ఎకరాల్లో గిరిజన గురుకుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని నిర్మిస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని వసతిగృహాన్ని ఆమె ద్విచక్రవాహనంలో వెళ్లి తనిఖీ చేశారు.
గుండుమల కేజీబీవీలో వసతులు కల్పిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి కలెక్టర్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
మండలం మాగేచెరువు వీఆర్ఓ సోమశేఖర్నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్కు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు.
సమస్యల పరిస్కారం కోసం ప్రజాగ్రీవెన్సులో ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణ పరిస్కారం చూపాలని సంబంధిత అదికారులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్లాయంలో నిర్వహించిన ప్రజాగ్రీవెన్సులో ఎమ్మెల్యే, మాజీమంత్రి నియోజకవర్గ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.