Home » Punjab Kings
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. నిజానికి.. హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ఊచకోత కోస్తుందని, 200కి మించి భారీ స్కోర్ చేస్తుందని...
ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. పంజాబ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం...
ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్కతా నైట్ రైడర్స్(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై సులువుగా గెలిచింది.
సిక్సర్లు.. ఫోర్లతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్పై కోల్కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
అసలే రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.
సాధారణంగా.. ఒక మ్యాచ్కి కెప్టెన్ దూరమైనప్పుడు, అతని స్థానంలో వైస్ కెప్టెన్గా ఉన్న ఆటగాడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అయితే.. ఏప్రిల్ 13వ తేదీన రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ దూరమైనప్పుడు, సామ్ కరన్ ఆ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl 2024) 27వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చివరి ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఆ క్రమంలో పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) స్టేడియంలో చేసిన రియాక్షన్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
గత రెండు మ్యాచ్ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.
నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.