Home » Protest
బీఎల్ఓ అధికార్ రక్షా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. బీఎల్ఓలకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలపై తీవ్రమైన పని ఒత్తిడి మోపుతున్నారని కమిటీ ఆరోపిస్తోంది.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
లద్దాఖ్లో హింసాత్మక ఘటనల అనంతరం జాతీయ భద్రతా చట్టం(NSA) కింద అరెస్టయిన వాంగ్చుక్ ప్రస్తుతం రాజస్థాన్లో జోథ్పూర్ జైలులో ఉన్నారు. వాంగ్చుక్ను ఆయన అన్నయ్య డోర్జీ లే, న్యాయవాది ముస్తఫా హజి కలుసుకున్నారు.
పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో చేపట్టిన ఆందోళనలపై పాక్ బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి.
పీఓకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు సైతం నిరాకరిస్తున్నారంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JACC) ఇచ్చిన పిలుపు మేరకు గత 72 గంటలుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, దుకాణాలు, స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి.
రాష్ట్రహోదా డిమాండ్లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్డౌన్కు పిలుపునిచ్చారు.
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని వాంగ్చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని, తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మిరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆయన ఆరోపించారు.