Home » Protest
పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో ఎన్డీయే మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.
నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడలో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసన బాటపట్టారు.
ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో నిరసనలు హోరెత్తాయి. భారత్లోని లద్ధాఖ్, పాకిస్థాన్లోని కరాచీ ప్రాంతాల్లో.. ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో నల్ల జెండాలు పట్టుకుని ఇరాన్పై దాడులను ఖండించారు.
దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ ఘటనలో విద్యార్థి సంఘం ప్రస్తుత, మాజీ అధ్యక్షులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.
ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.
బంగ్లాదేశ్లో హింస చెలరేగుతోంది. తమ నేత హాదీని హత్యచేసిన ఇద్దరు వ్యక్తులు భారత్లో ఉంటున్నారని ఆరోపిస్తూ.. తాజాగా భారత్ వ్యతిరేక నిరసనలు చేపట్టింది ఇంకిలాబ్ మోంచా. అక్కడి భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.