Home » Priyanka Gandhi
కాంగ్రెస్ పార్టీ ఓ కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఓటు హక్కు రక్షణ, ఓటు చోరీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల ఓటు విలువను కాపాడడమే లక్ష్యంగా కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎంపీ ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనడం ద్వారా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రలో మహిళల మద్దతు కూడా కూడగడతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆదివారంనాడు పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి స్వంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యతిరేకిస్తున్నా శశిథరూర్ మాత్రం బీజేపీ సర్కారు కొత్తగా తెచ్చిన బిల్లును స్వాగతిస్తున్నారు.
న్నికల కమిషన్ ఈసీపై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరింత తీవ్రతరం చేశారు...
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే 60 వేలాది మంది మరణానికి కారణమైందని, వారిలో 18,430 మంది చిన్నారులేనని..
ఢిల్లీ పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు.