Home » Politics
మణుగూరు వివాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు, భువనేశ్వరి లండన్ వెళ్లారు. ఈ మేరకు లండన్ తెలుగు కుటుంబాలు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు.
మణుగూరు పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేగా కాంతారావు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
హైడ్రాపై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా(HYDRAA) చేసేది మంచే అయితే భట్టి విక్రమార్క చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవని మండిపడ్డారు.
జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షులుగా బుర్ర రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ లను నియమిస్తున్నట్లు జాగృతి అధికారిక ఎక్స్ (X) ఖాతా వేదికగా స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
న అరెస్ట్ పై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తొలిసారి స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మాంసాభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు తనీఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులతో కలసి మాంసం విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క మంచిపనైనా చేసిందా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని.. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని చెప్పారు.