Home » Politics
ఇండియా స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) 2022లో నౌకాదళంలో ప్రవేశపెట్టబడింది. ఇది దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీపావళి సందర్భంగా నిర్విరామంగా స్వీట్ షాప్స్పై రైడ్స్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు.. టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించారు. నగరంలో 45 స్వీట్ షాపుల్లో తనిఖీలు విస్తృతం చేశారు.
దేశంలోని ప్రజలకు ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి బహుమతి ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గత ఐదేండ్ల గణంకాలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి ఎంపికవుతున్న IASల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2023-24 లో ట్రైనింగ్ పూర్తి చేసిన ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు 1 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ను బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడుతామని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు, సతీష్ కు విప్లవ ప్రజలు తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తల్లిదండ్రులు, గ్రామస్థులు, కమ్యూనిస్ట్ నాయకులు కన్నీటిపర్యంతమై తుది వీడ్కోలు పలికారు.
ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు గుర్తుకు వచ్చేదని KTR తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మిల్లు కేవలం పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదని.. వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిన మిల్ అని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజం జాహీ మిల్లు మూతపడిందని చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కాస్త రిలాక్స్ అయింది. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదతీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలామునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది.