Home » Politics
బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని.. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని కవిత ఎద్దేవా చేశారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
సిద్దిపేట కోహెడ మండలం తీగలకుంటపల్లిలో మరికొద్ధిసేపట్లో రామ్ చంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన ఆయన.. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో ఎన్కౌంటర్లో మృతిచెందారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలైంది. జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఈసీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ న్యాయవాది సురేందర్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం, ఈసీ కోరింది.
ఆసిఫ్నగర్ మండలం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్లోని సర్వే నంబరు 50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహ తయారీదారులకు అశోక్ సింగ్ అద్దెకు ఇస్తున్నట్లు తెలిపింది.
టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.
తమిళనాట హిందీ భాషా వినియోగంపై నిషేధం విధిస్తున్నారని, ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో.....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడి లిస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓటర్ల జాబితాలో వీరి లిస్ట్ కనబడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.