Home » PM Modi
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మాఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రజలకు సాష్టాంగ వందనం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఒమన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు వ్యాఖ్యానించారు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని, ప్రధాని మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, తెలంగాణలో కూడా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామంచందర్రావు ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.
టీవీకే పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పురోగతి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని మోదీని కోరారు.
ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.