Home » PM Modi
వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.
తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలియజేశారు.
ఫ్రాన్స్లో జరగనున్న 52వ జీ7 దేశాల సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరవుతున్నారు.
దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు..
ఏపీలో కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తామని పేర్కొన్నారు.
దేశ సమస్యలు, విద్యావ్యవస్థలో లోపాలపై రానున్న రెండు, మూడు నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచారాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు ప్రధాని మోదీ వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.
దేశాభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండటం అవసరమని ప్రజలు గుర్తించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు.
ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడంపై సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ గత 12 ఏళ్ల ప్రయాణం... భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు.