Home » PM Modi
మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్లో దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు.
విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలను నేడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఘటనపై సంతాపం వెలిబుచ్చారు.
భారత్ - ఐరోపా సమాఘ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడంతో భారత్కు మార్కెట్ వాల్యూ పెరిగింది. దిగుమతి సుంకాలు భారీగా దిగిరానున్నాయి. లగ్జరీ కార్లు, వైన్స్ స్పిరిట్తో పాటు మెడికల్ ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటీవల తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు..
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.
దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.
కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.