Home » PM Modi
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమైందని ప్రధాని మోదీ ప్రశంసించారు.
మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్య ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రకటించింది.
వర్షాకాలం సీజన్లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జగ్దీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది.
ట్రంప్ పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు పలువురిని గాయపరిచాయని, 50 శాతం టారిఫ్ ప్రభావం ఇప్పటికే మనపై పడిందని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ ప్రజలకు అండగా నిలుస్తుందని, కష్టకాలంలో పూర్తి సహకారాన్ని అందిస్తుందని, ఇందుకు ప్రధాని పంజాబ్లో పర్యటించనుండటమే నిదర్శనమని బీజేపీ పంజాబ్ యూనిట్ తెలిపింది.