Home » Philippines
ఫిలిప్పీన్స్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. మిండనావ్ ద్వీపంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా నమోదైంది..
ఫిలిప్పీన్స్ భూకంపం ధాటికి 15 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరానికి సమీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో, ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి బంధాలను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మనీలాలో ఫలప్రదంగా ముగిసింది. ఇందులో ఐటీ సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.
ఫిలిప్పీన్స్లోని ఒక పట్టణ మేయర్ లక్ష్యంగా రాకెట్ దాడి జరిగింది. అయితే మేయర్ ప్రయాణిస్తోన్న ఆర్మర్డ్ వాహనం దాని ప్రభావాన్ని తట్టుకుని ముందుకు సాగడంతో మేయర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఓ పర్యాటకుడు అత్యంత విషపూరితమైన బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ను చేత్తో పట్టుకున్నాడు. నీటిలో వెళుతున్న దానితో ఆటలాడాడు. అదృష్టం బాగుండి అది అతడ్ని ఏమీ చేయలేదు. లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి.
ఓ యువతి తన పెంపుడు కుక్క కోసం ఎవ్వరూ ఊహించని పని చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్కను రక్షించడానికి తన ప్రాణాలకు తెగించింది. ఈ సంఘటన ఫిలిప్పీన్స్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
శుక్రవారం ఉదయం ఫిలిప్పిన్స్ దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మిండనావోలోని కోస్టల్ ఏరియాలోనూ వరసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఫిలిప్పీ్న్స్లో భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. అయితే, భూకంపంతో సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పేర్కొంది.