Home » Petrol Price
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపిందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజకీయ పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది, అయినప్పటికీ వినియోగదారులకు రిటైల్ పెట్రో ధరలు యథాతథంగా ఉంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఒక ప్రకటనలో తెలిపింది.
పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఇది శుభవార్త. పశ్చిమబెంగాల్ పోలింగ్ ఈనెల 29న పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను కేంద్రం కొట్టివేసింది. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.
పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హోర్ముజ్ ద్వారా జరగాల్సిన చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.