Home » Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం తన ఎక్స్ ఖాతాలో టీటీడీపై ఓ పోస్టు పెట్టారు. గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని అన్నారు.
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
'పవన్ కళ్యాణ్.. మిమ్మల్ని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు' అని భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు, పవన్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాని చెప్పారు.
ఏపీలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని.. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ..
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన జనసేనాని మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారని, రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్' బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోదీతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఉన్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.