Pawan Kalyans Twitter Statement: గత టీటీడీ బోర్డు తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: పవన్
ABN , Publish Date - Nov 11 , 2025 | 09:29 PM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం తన ఎక్స్ ఖాతాలో టీటీడీపై ఓ పోస్టు పెట్టారు. గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని అన్నారు.
గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ మంగళవారం సాయంత్రం తన ఎక్స్ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..
‘బోర్డు, అధికారులు, ఈఓ, జేఈఓ నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విక్రేతల వరకు టీటీడీని నడుపుతున్న ప్రతి ఒక్కరికీ మీ పాత్ర కేవలం హోదా లేదా బిరుదు కాదు. లక్షలాది మంది సనాతనులకు దైవిక సేవ చేయడానికి ఒక పవిత్ర అవకాశం. ఆర్థిక నివేదికలు, నాణ్యత నియంత్రణ, ఆడిట్ల నుంచి విరాళాల నిర్వహణ వరకు అన్ని కార్యకలాపాలలో పూర్తి పారదర్శకతను పాటించాలి.
అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించడం భవిష్యత్తు కోసం ఒక ముందడుగు. ధర్మాన్ని రక్షించడం, దాని కోసం నిలబడటం ప్రతి ఒక్క సనాతనికి సమిష్టి బాధ్యత. దేశవ్యాప్తంగా ఉన్న మన దేవాలయాలన్నింటినీ సమాజం.. భక్తులే స్వయంగా నిర్వహించాలని నా ఆకాంక్ష’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రూ. 500 కోట్ల భారీ బెట్టింగ్!
బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!