Home » Parliament
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా తాత్సారం చేసింది. బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించి కనీసం నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలోకి తోసేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఫాస్ట్గానే ఉంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. మరి కాంగ్రెస్? ఇంకా కొన్ని పెండింగ్లోనే పెట్టింది.
గంధపు చెక్కల స్మగ్లర్, బందిపోటు వీరప్పన్ కుమార్తె లోక్ సభ ఎన్నికల బరిలోకి నిలిచారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసిన విద్యారాణి రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నామ్ తమిళర్ కట్చి టికెట్పై పోటీ చేయనున్నట్లు తెలిపారు.
లోక్సభ ఎన్నికలపై బీజేపీ(BJP) దృష్టి సారించింది. అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల కీలక నేతలతో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శనివారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొనారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మే 13వ తేదీన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ఓటింగ్ సమయంలో హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నిక వచ్చిన 40శాతం మించి పోలింగ్ జరగడం లేదని చెప్పారు. ఈ సారి ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెరగాలని కోరారు.
మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మొదటి విడతలో ఎన్నికలు ( Elections ) జరిగే ప్రాంతాల్లో నామినేషన్ పత్రాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డిపాజిట్ కట్టి తమ అభ్యర్థిత్వాన్ని నామినేషన్ చేయించుకుంటున్నారు.
కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై సీఈఓ వికాస్రాజ్(CEO Vikasraj) కీలక సూచనలు జారీ చేశారు. సోమవారం నాడు తెలంగాణ బీఆర్కే భవన్లో సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ... 3కోట్ల 30లక్షల మంది ఓటర్లు ఉంటే....8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు చెప్పారు.
Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పలు సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటువేయాలని చెప్పారు. ముఖ్యంగా మల్కాజ్గిరి సీటును తిరిగి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.