Home » Pakistan
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్లు.. ఒక దేశంపై మరో దేశం ఆంక్షలు విధించుకున్నాయి. ఆ ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఎయిర్ ఇండియా విమానం పాక్ గగనతలంలోకి ప్రవేశించింది.
స్విట్జర్లాండ్లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.
సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు.
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు.
తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత, పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పాక్ పోలీసుల కాల్పుల్లో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం చెందడం కలకలం రేపుతోంది. జూన్ 10న ఈ దారుణం జరిగింది. ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.