Home » Pakistan
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న పాకిస్థాన్కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్ను పూర్తిగా నమ్మలేమని ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రితో ఫోన్లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం, బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు మరోసారి సంక్షోభంలో పడినట్లు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన కీలక సమావేశాలకు ఇరాన్ సానుకూలంగా స్పందించకపోవడం ఈ అనిశ్చితిని మరింత పెంచింది.
పాకిస్థాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.
గల్ఫ్లో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేలా నేడు పాక్లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే, యూఎస్తో నేరుగా చర్చించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల్ని రద్దు చేసింది.
పాక్లో యూఎస్తో చర్చల సందర్భంగా తమ అణు కార్యక్రమం ప్రస్తావనకు అంగీకరించి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మహమూద్ నవాబియన్ అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ జట్టు స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా తేలాడు. దీంతో అతడి కెరీర్పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటనపై వైట్ హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన పర్యటన వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
గతేడాది ఏప్రిల్లో జమ్మూ, కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం దాడులు చేసింది.