Home » Odisha
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ స్టాక్ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఒడిశాలో 2024 జూన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఒడిశా పూరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్గా మారింది. 19 ఏళ్ల ఓ యువతి సాయంత్రం తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లింది. అక్కడ వారు కూర్చున్నప్పుడు పలువురు వీడియో తీసి మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగలేదు.
ఒడిశా టు హైదరాబాద్ బస్సులో బ్రీఫ్ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్ జీవన్కిరణ్, ఇన్స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్వాచ్ నిర్వహించారు.
ఒడిశాలో సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శక్తి రంజన్ దాస్, అతని కార్యాలయాలపై జరిగిన దాడుల్లో భారీగా నగదు, ఆభరణాలు, కార్లు లభ్యమయ్యాయి.
మనోజ్కు ‘ఛేంజ్ యువర్ లైఫ్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మోటివేషనల్ వీడియోలు పెడుతుంటాడు. ప్రజల్ని తన మాటల్తో మోటివేట్ చేస్తున్నాడు.
మన దేశంలో ఇంకా చాలా చోట్ల వైద్య అర్హత లేని వ్యక్తులు చికిత్సల పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సరైన వైద్య విద్య లేకుండానే చికిత్స పేరుతో ప్రాణాంతక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
సాగర్ నీటిలోకి వెళ్లాడు. ఓ రాయిపై నిలబడి మిత్రుడితో వీడియో తీయించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు
ఇండియా బంగారం దిగుమతులపై ఆధారపడే రోజులు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశాలో కొన్ని జిల్లాల్లో బంగారు నిధులు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు.
నవీన్ పట్నాయక్ ఆదివారం నాడు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వైద్యుల బృందం ఆయన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఆయనను మెడికేర్ ఆసుపత్రిలో చేర్చారు. 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్కు ఇటీవల ముంబైలో స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు.