Home » NRI
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న మృతిచెందారు. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అమెరికాలోని డాలస్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో 'ఫాదర్స్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సేవలలో భాగంగా జూన్ 21న ఏర్పాటు చేసిన 'ఫాదర్స్ డే హైకింగ్' ఈవెంట్ ఉల్లాసంగా సాగింది.
2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని తెలిపారు.
దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక ముందడుగు వేసింది. ఎన్ఆర్ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.
నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
కువైట్లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి మార్గదర్శకత్వంలో.. తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు, వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్లోరిడాలోని స్టెయిన్బ్రెన్నర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఆవిష్కరణల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది.