Home » NRI
జాతీయ అవార్డు గ్రహీత, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు ప్రతిష్ఠాత్మక 'దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లోని యాడమ్స్ టౌన్లో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు.
కువైట్లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మర్మ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్' కార్యక్రమం ఘనంగా జరిగింది. 100 మందికి పైగా ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొని, మర్మ థెరపీ ప్రయోజనాలపై అవగాహన పొందారు.
న్యూయార్క్లోని ఫ్లషింగ్లో జరిగిన టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో అశోక్ చింతకుంట దంపతులు అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ శెట్టి చేతులమీదుగా ఈ అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభమైంది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైవే దత్తత’ కార్యక్రమం సామాజిక సేవలో తెలుగు విద్యార్థుల చైతన్యాన్ని మరోసారి ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రహదారి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు.. చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
అమెరికాలో నాట్స్ సంస్థ ప్రవాస భారతీయుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వెల్నెస్ వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, వెల్నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 'స్థానిక సమాజానికి సేవ' కార్యక్రమంలో భాగంగా సుమారు 600 మందికి ఆహారం, అవసరమైన సరుకులు అందించారు.
జర్మనీలోని పలు నగరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.