Home » NRI
'మీ పిల్లల్ని అమెరికాకు పంపకండి' అంటూ అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలంగాణ యువకుడు అన్షుల్ కుంచ కుటుంబసభ్యులు కోరుతున్నారు. తమ సోదరుడి హత్య ముమ్మాటికీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్షుల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.
మెల్బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్బోర్న్కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి వ్యాఖ్యానించారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు.
పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా భారీ విరాళాన్ని అందజేసింది.
రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది.
అమెరికాలోని తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండటం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన మారథాన్లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.