Home » NRI
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.
లండన్లో ఉంటున్న ఓ భారతీయ యువతి తన బ్రిటీష్ ప్రియుణ్ణి స్వదేశానికి తీసుకొస్తే ఆమె కుటుంబసభ్యులు అపూర్వ స్వాగతం పలికారు.
ప్రాంతాలకు మతాలకు, రాజకీయాలకు అతీతమైన లాభాపేక్షలేని WETA ఆధ్వర్యంలో "అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ మహానగరము "ఫ్రిస్కో" లోని ఇండిపెండెన్స్ హై స్కూల్ లో నిర్వహించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైనటువంటి ఎన్నారైలు ఆదివారం సాయంత్రం.. మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు.
ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి భారత సంతతికి చెందిన దంపతులతోపాటు(Indian Origin Couple) వారి 16 ఏళ్ల కుమార్తె కూడా మరణించింది. అయితే వీరి మృతి ప్రస్తుతం అనుమానాస్పదంగా మారింది. ఆ విరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఆస్ట్రేలియాలో మరో దారుణం వెలుగుచూసింది. మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని అలియాస్ శ్వేత అనే హైదరాబాదీ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విక్టోరియాలోని బక్లీలో వెలుగుచూసిన ఈ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ మనమవరాలు వేమూరు ఉజ్వల. ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసింది. ట్రెక్కింగ్కు వెళ్లి కన్నుమూసింది. ఉజ్వల గోల్డ్ కోస్ట్లో గల గల బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇంతలో విషాదం నెలకొంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.