Home » NRI Latest News
మెల్బోర్న్ మహానాడు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ హరీశ్ గంటి మెల్బోర్న్కు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మెల్బోర్న్ నాయకులు, కార్యకర్తలు, ఆయన స్నేహితులు ఘన స్వాగతం పలికారు.
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల వ్యవహారాలపై అవగాహన కల్గిన దౌత్యవేత్త విపుల్ ను సౌదీ అరేబియాలో నూతన రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది.
అమెరికా రాజధాని పరిధిలో భానుప్రకాశ్ మాగులూరి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులును ఘనంగా సత్కరించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న 'ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా భారీ విరాళాన్ని అందజేసింది.
రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది.
వివాహం బంధంలోకి ఎంతో సంతోషంగా అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ యువ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా గడిపిన భారత సంతతి కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణుడు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన మారథాన్లలో ఒకటైన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి మరో అరుదైన ఘనతను సాధించారు.
అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఐదు దశాబ్దాలుగా తరతరాలకు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ టీసీఏ యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా మినీ మహానాడు, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.