Home » Nizamababad
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.
కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.
నిజామాబాద్లో పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారమిచ్చారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.
మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. మునిసిల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రోడ్డుపై లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న ఘర్షణ ఒక డ్రైవర్ ప్రాణాన్ని బలిగొంది. మరో లారీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎదుటి లారీ డ్రైవర్ పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
యజమాని ఇంట్లో లేని సమయంలో సదరు మహిళ డబ్బులు దొంగిలిస్తూ ఉండేది. తరుచూ డబ్బులు కనిపించకుండా పోవడాన్ని ఇంటి యజమాని గుర్తించాడు. అసలు ఎవరు దొంగతనం చేస్తున్నారా అని గుర్తించడానికి స్పై కెమెరా అమర్చాడు.
గత రెండు రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలు చూస్తే కొనలేని పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు.
వాట్సప్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.6 లక్షల నగదును పోగొట్టుకున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.