Home » Nirmala Sitharaman
కేంద్ర బడ్జెట్ అంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశం గమనాన్ని నిర్దేశించేంది కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్-2026కు సమయం సమీపిస్తున్న తరుణంలో అనేక ఆసక్తికర సాంప్రదాయాలు, చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్-2026ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ సుంకాల పెంపు, చమురు ధరల్లో హెచ్చు తగ్గులు, మారుతున్న రూపాయి-డాలర్ సమీకరణం నేపథ్యంలో ఈ బడ్జెట్ కోసం చాలా మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడం, గృహ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం.. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని నిఫుణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హోమ్లోన్ వడ్డీ రాయితీ రూ.5 లక్షలకు పెంచే అవకాశముందంటున్నారు.
తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రి బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. RRR, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, PRLI జాతీయ ప్రాజెక్ట్ హోదా, విద్య–ఆరోగ్య రంగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరుగుతాయని వెల్లడించారు.
శ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శ గ్రామీణ నైపుణ్య కేంద్రానికి వేదికగా నిలిచింది. గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తూ, యువత, మహిళలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సైయెంట్ ఏఐ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ హబ్’ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.......
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు......
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
స్రీశక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నిది కేంద్రమంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు.