Home » Nimmala Rama Naidu
ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సీఈ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని తెలిపారు.
పాలకొల్లు నియోజకవర్గంలో రూ 5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్లతో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేందుకు పోలవరం ఎడమ కాలువే ప్రధాన ఆధారమన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు.
వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ రక్త చరిత్రను రాజకీయంగా మార్చుకుందని, ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో అలసత్వంపై మంత్రి ఆగ్రహించారు. నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత పనుల అంచనాల తయారీపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అత్యంత దుర్మార్గమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.