Home » Nimmala Rama Naidu
ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగానికి ప్రస్తుతం పునర్జీవం పోస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు వేగవంతంగా జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.
రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే, గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దారిన పోయే దానయ్య చనిపోతే నష్టమేంటని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.
ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
సూపర్ ఎల్నినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని.. కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చించారు.
టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు.
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన అంశంపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణతో పార్టీ అధిష్ఠానం సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.