Home » Nepal
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్టైమ్ గవర్నెన్స్ సెంటర్కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.
సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ రాజధాని కఠ్మాండూ అట్టుడుకుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగారు. విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి.
నేపాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జెన్ జెడ్ ఆందోళనలు స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులకూ తలనొప్పిగా మారాయి. తాజాగా, ఓ భారత మహిళ ఈ పరిస్థితుల్లో ఇరుక్కుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా సాయం చేయాలని కోరుతూ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది.
నేపాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధం వెనక్కి తీసుకున్నా యువత ఆందోళన మాత్రం మూడో రోజు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి.
అన్ని వర్గాలు చర్చలు ప్రారంభించి నిరసనలకు ముగింపు పలకాలని నేపాల్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటితే కఠిన చర్యలకు పూనుకుంటామని కూడా హెచ్చరించారు.
జెన్ జీ నిరసనల్లో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని జలనాథ్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి మరణించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
నేపాల్ యువత ఆగ్రహం ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించాయి. ప్రధాని ఓలి, అధ్యక్షుడి ఇళ్లు ధ్వంసం చేశారు నిరసనకారులు.
నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. నేపాల్లో జెన్ జెడ్ (Gen Z)యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి..
నేపాల్ రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ, ప్రధాని కేపీ శర్మ ఓలీ అనూహ్యంగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నేపాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితులు మారుతున్న క్రమంలో భారత విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ విడుదల చేసి సూచనలు జారీ చేసింది.