Home » Nepal
ఇప్పుడు నేపాల్ రాజకీయ రంగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఒలీ రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా తాత్కాలిక ప్రధానమంత్రిగా కుల్మన్ ఘీసింగ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నేపాల్లో యువత సాధించింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వాన్ని, జెన్ Z నిరసన పేరిట కూలదోసింది. ఇక ఇప్పుడు తమకు ఇష్టమైన నాయకురాల్ని దేశ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతోంది. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ..
శాసనసభ బిల్లులకు గవర్నర్ల ఆమోదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో కల్లోల పరిస్థితుల గురించి ప్రస్తావించిన ఆయన తనకు భారత రాజ్యాంగం గర్వకారణమని అన్నారు.
నేపాల్లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారు.
నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. జెన్-జీ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఈ నేపధ్యంలో..
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్టైమ్ గవర్నెన్స్ సెంటర్కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.
సోషల్ మీడియాపై నిషేధం కారణంగా నేపాల్ రాజధాని కఠ్మాండూ అట్టుడుకుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై యువత భారీ నిరసనకు, ఆందోళనకు దిగారు. విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి.
నేపాల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జెన్ జెడ్ ఆందోళనలు స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులకూ తలనొప్పిగా మారాయి. తాజాగా, ఓ భారత మహిళ ఈ పరిస్థితుల్లో ఇరుక్కుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా సాయం చేయాలని కోరుతూ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది.
నేపాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధం వెనక్కి తీసుకున్నా యువత ఆందోళన మాత్రం మూడో రోజు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశాయి.
అన్ని వర్గాలు చర్చలు ప్రారంభించి నిరసనలకు ముగింపు పలకాలని నేపాల్ ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటితే కఠిన చర్యలకు పూనుకుంటామని కూడా హెచ్చరించారు.