Home » Nellore
నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఒక అరుదైన, ఆత్మీయ ఘట్టం చోటుచేసుకుంది. మంగళవారం కావలిలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన పర్యటనలో ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ఒక సాధారణ జాలరి కుటుంబంతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.
ఏపీ సముద్ర తీర ప్రాంత భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు, స్థానిక మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
చరిత్రలో తొలిసారి రూ.262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అబద్ధాలు చెప్పదని... ప్రచారాలు చేసుకోదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు.
రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపి బాధితుడిని నిలువునా దోచుకున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశ ప్రయోజనాలు, ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈనెల13న ప్రారంభమయ్యే పార్టీ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పరిశీలించారు.