Home » National
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు దఫాలుగా కోర్టుకు ఆయనకు జ్యూడీషియల్ కస్టడీని పొడగిస్తూ వస్తోంది కోర్టు. తాజాగా ఇవాళ్టితో కస్టడీ ముగియగా..
మూడో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5),ఛత్తీస్ ఘడ్(7),దాద్రా నగర్ హవేలీ ,డామన్ & డయ్యు,(2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
మద్యం విధానం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇకపై మరో అంశంలో ఎన్ఐఏ దర్యాప్తును ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి
మణిపూర్(Manipur)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం(heavy rain), వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు(Schools), కళాశాలలు(colleges) బంద్ చేస్తున్నట్లు సీఎం ఎన్ బీరెన్ సింగ్(Biren Singh) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్ అబూబకర్ తిమోల్ (27)ను గుజరాత్లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు శుక్రవారం హైకోర్టులో నిరాశ ఎదురయింది.
భారత్కు చెందిన రక్షణ, ఏరోస్పేస్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్.. కీలక మైలురాయిని సాధించింది.
కొవిషీల్డ్ టీకా వేయించుకున్న కొంతకాలానికే తన కుమార్తెను పోగొట్టుకున్న ఓ తండ్రి.. ఆ టీకాతో దుష్ప్రభావాలున్నాయంటూ ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఆ కంపెనీపైన, సీరం సంస్థపైన కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యారు.
మూడో విడతలో భాగంగా గోవాలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13 న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 454 మంది పోటీ చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 525 మంది పోటీ చేస్తున్నారు.