Home » National News
నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.
ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి తాజాగా ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ షాక్ ఇచ్చారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరారు.
టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్ను తన కొడుకుతో సమానమని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం గాలిస్తున్న పోలీసులు కాళీఘాట్లోని అభిషేక్ నివాసానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
మ్యాగీ నూడుల్స్లో పురుగులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై నెస్లే ఇండియా సంస్థ స్పందించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది.
టీఎంసీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీలంతా తమనే అసలైన టీఎంసీగా పరిగణించాలని కోరుతూ స్పీకర్ను కోరేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఉపక్రమించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభానికి భారత్లో మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. సంస్థకు అవసరమైన తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
అస్సాంలో ఓ రవాణా విమానం కూలిపోయింది. ఐఏఎఫ్కు చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిందని, ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.