Home » National News
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్కు చెందిన రెండు ఎల్పీజీ టాంకర్లకు ఇరాన్ అనుమతించింది. దీంతో భారత జెండాలున్న రెండు ఇంధన నౌకలు శనివారంనాడు హోర్ముజ్ జలసంధిని దాటి భారత్కు పయనమయ్యాయి.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 26న వాంగ్చుక్ను నిర్బంధంలోకి తీసుకున్నారు.
యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే (నిజం)’’ ..మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనెటర్ హైరామ్ జాన్సన్ సెనెట్లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది! యుద్ధం జరిగిన ప్రతిసారీ అది రుజువవుతూనే ఉంది....
ఇండిగో సంస్థ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఫ్యూయల్ సర్ఛార్జీని ప్రకటించింది. ఆ ప్రకారం ప్రయాణికులకు ఒక్కో టిక్కెట్పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం పడనుంది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు.
ఎల్పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)ను తొలగించాలంటూ 'ఇండియా' కూటమి పార్టీలు తీర్మానాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చాయి. ఇందుకు సంబంధించిన తీర్మానం నోటీసును పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్ష నేతలు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు.
పకోడీ తీసుకుని తిరిగి ఆమె ఉన్న చోటకు వచ్చాడు. కానీ, అక్కడ తన భార్య కనిపించలేదు. అక్కడే చుట్టుపక్కల ఉంటుందని భావించి బస్టాండ్ మొత్తం వెతికాడు. కానీ, ఎక్కడా కనిపించలేదు. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? సదరు వ్యక్తి భార్య ఎక్కడికి వెళ్లింది? పకోడీ తెమ్మని చెప్పి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వి.కే. శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం’ అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.