Home » Narendra Modi
తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్పై మండిపడ్డారు. అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈరోజు (ఆదివారం) తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయింది.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని 'చరిత్రాత్మకమైనది, నిర్ణయాత్మకమైనది' అని అభివర్ణిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర క్యాబినెట్ ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్, తదితర రంగాలకు ఈ నిధులను కేటాయించారు.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పార్టీ కార్యకర్తల కఠోర శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్ప్రెస్వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) మృతిపై ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞత తెలిపారు.