Home » Nara Bhuvaneswari
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025'ను సౌత్జోన్ ప్రదానం చేసింది.
విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.
నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా సమాజ హితం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను నారా భువనేశ్వరి లండన్లో ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
లండన్లోని వెస్ట్మినిస్టర్ హాల్లో 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న నారా దేవాన్ష్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు దేశ విదేశాల్లోని తెలుగువారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.