Home » Nandamuri Balakrishna
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.
సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
హిందూపురం నియోజకవర్గంలో స్మాల్స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే కలిశారు.
విజయవాడలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్కు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులకు కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు.
పదవులు ముఖ్యం కాదని... వాటికే తాను అలంకారమన్నది తన భావనని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 మూవీ తీశామని చెప్పుకొచ్చారు. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని బాలకృష్ణ పేర్కొన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నందమూరి బాలకృష్ణకు స్థానం దక్కడంతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య మామయ్యకు అభినందనలు అని లోకేష్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని.. దీంతో తాము ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.