Home » Minister Satya Kumar
డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే సెవన్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో ఎందుకు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు
ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) నివేదిక పరిశీలిస్తే ఏపీ వికాసం వైపు ఉరకలేస్తోందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
Satyakumar Review Meeting: స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అగ్రికల్చరల్, ఇండస్ట్రీయల్, సర్వీస్ సెక్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. చిరు వ్యాపారులు ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన చేయూతను ఇస్తామని ప్రకటించారు.
రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి సత్యకుమార్తో ....
కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.