Home » Medaram Jatara
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను చెల్లంచుకుంటున్నారు. ఈనెల 28 నుంచి మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో ముందస్తుగానే విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం.. భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగా విచ్చేసి తమతమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా పనులు ధరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు విచ్చేయనుండడంతో.. ఆయన వచ్చే దారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీ దగ్గరపడ్డ తరుణంలో వివిధ పనులన్నీ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
మేడారం జాతరకు కేసీఆర్ను అధికారికంగా ఆహ్వానించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మహిళా మంత్రులు కేసీఆర్ను మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వానపత్రిక అందించారు.
మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆమె మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు. రాష్ట్రపతికి సమ్మక్క తల్లి చీరను, కంకణం, కండువ బంగారాన్ని మంత్రులు అందజేశారు.