Home » Mamata Banerjee
పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.
పశ్చిమ బెంగాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసన బాటపట్టారు.
ఓటర్ రోల్ క్లీన్-అప్ డ్రైవ్ విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పరసర్ప నిందారోణపలు చోటుచేసుకోవడం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సంక్లిష్ట పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు న్యాయాధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదంపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఆమె.. తన పిటిషన్పై స్వయంగా వాదనలు వినిపించారు.
బడ్జెట్లో కేంద్రం ప్రస్తావించిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టడం జరిగిందని, మూడు కారిడార్లంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోందని మమతా బెనర్జీ అన్నారు.
అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని వీడాలని పవార్ ఆలోచిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ నాయకులకు సైతం భద్రత లేకుండా పోతోందన్నారు.
నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఐఆర్ కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులు, ఆవేదనలతో కూడిన 26 కవితల సంపుటితో తన 162వ పుస్తకాన్ని ఇదే బుక్ ఫెస్టివల్లో విడుదల చేయనున్నట్టు మమతా బెనర్జీ తెలిపారు.