Home » Mamata Banerjee
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి 21 రోజులయింది. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అంశంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
''బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.
పశ్చిమబెంగాల్లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగస్ట్ 28వ తేదీన పశ్చిమ బెంగాల్లో 12 గంటల బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్ట్రాక్/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.
తమ కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదని కోల్కతా(Kolkata) ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.
జన్మదినం సందర్భంగా ప్రొ. సందీప్ ఘోషకు సీఎం మమతా బెనర్జీ బర్త్ డే విషెష్ చెబుతున్న ఓ లేఖ ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదీకూడా 2022, జూన్ 30వ తేదీ ప్రొ. సందీప్ జన్మదినం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఈ లేఖ ద్వారా బర్త్డే విషెస్ చెప్పినట్లుగా ఆ లేఖలో స్పష్టంగా ఉంది.