Home » Mallu Ravi
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అందుకే తెలంగాణ రాష్టానికి చెందిన ఎంపీలందరం వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీరుపై రాజ్గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై ఉన్న కారణం ఏంటో తెలుసుంటామని మల్లు రవి తెలిపారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని చెప్పారు.
జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ తెలిపారు.
అవినీతికి పరాకాష్ఠ కవిత అని, ఆమె ఘనకార్యం వల్లనే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖతమయ్యాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా రప్పా డైలాగులపై ఆయన స్పందించారు. సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లవని మల్లు రవి అన్నారు.