Home » Mallu Ravi
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి మరోసారి మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. ఫాం హౌస్లో ఉండే కేసీఆర్కు పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియనట్లు ఉందన్నారు.
నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజమని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
కాంగ్రెస్లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అందుకే తెలంగాణ రాష్టానికి చెందిన ఎంపీలందరం వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీరుపై రాజ్గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై ఉన్న కారణం ఏంటో తెలుసుంటామని మల్లు రవి తెలిపారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని చెప్పారు.