Home » Mallikarjun Kharge
బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.
సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు.
సర్దార్ పటేల్ అప్పట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావిస్తూ, మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు తెలిపారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ, దేశంలోని ప్రముఖులు ఆరా తీసున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య..
ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సీడబ్ల్యూసీలో పాల్గొన్నారు. మంగళవారం నాడు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు, ఉత్తర కర్ణాటకలో భారీ వరదలు, పంట నష్టం బాధితులను ఆదుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
జాతీయంగా, అంతర్జాతీయంగా దేశం సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని ఖర్గే అన్నారు. మోదీ, ఆయన ప్రభుత్వ దౌత్య వైఫల్యాల కారణంగానే అంతర్జాతీయంగా మనం సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్పీని మోదీ దోచుకుంటున్నారని విమర్శించారు.