Home » Mallikarjun Kharge
రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకే ధన్ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలియదని, ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షానే ఉండేవారని, అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.
తెలంగాణలో విస్తృత స్థాయిలో, శాస్త్రీయంగా, అర్థవంతంగా కులగణన జరిపిన తీరు దేశానికే ప్రామాణికంగా నిలిచిందని కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, ఆయన బృందాన్ని ప్రశంసించింది.
దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సమీక్ష జరపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని... కానీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచే విషయంలో తెలంగాణను ఏఐసీసీ నమూనాగా తీసుకోనుందా? ఈ నమూనా చూపుతూ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని భావిస్తోందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
నేటి (జూలై 21) నుంచి దేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని గత ఐదేళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని మోదీకి రాసిన లేఖలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇరువురు కోరారు. దీనితో పాటు లద్దాఖ్ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026 ఏప్రిల్, జూన్, నవంబరుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రసంగాలు, ప్రకటనలతో బిజీ ఉందని, వారికి ప్రజల బాధలు పట్టవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఢిల్లీ లీడర్లా కాకుండా గల్లీ లీడర్లా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు.