Home » Madras High Court
కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.
ఎన్నికల వివాదానికి సంబంధించి ఒక పిటిషన్ సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని వ్యాఖ్యానించింది.
దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి, ప్రత్యేక దర్శనాలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్శనాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై ప్రభుత్వం స్పందించేందుకు ఆరు వారాల గడువు ఇచ్చింది.
‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీలతో తలబడుతున్న టీవీకే చీఫ్ విజయ్కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లతో వ్యత్యాసాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విజయ్కు నోటీసులు జారీ చేసింది.
హీరో విశాల్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొనసాగుతున్న వివాదం కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జయచంద్రన్ తప్పుకున్నారు. లైకా సంస్థకు విశాల్ రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో గత కొంతకాలంగా సాగుతోంది.
పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? టీవీకే పార్టీ నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.
టీవీకే పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ ప్రారంభ దశలోనే CBI దర్యాప్తు కోరడం సరికాదని సూచించింది.
టీవీకే న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు ఎస్.అరివాళగన్ సారథ్యంలోని కొందరు అడ్వకేట్లు ఆదివారంనాడు గ్రీన్వేస్ రోడ్డులోని జస్టిస్ ఎం.దండపాణి నివాసానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యామ్నాయంగా కరూర్ విషాద ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
జెండా స్తంభాల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మద్రాసు హైకోర్టు ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీలు, మత, కుల సంఘాలు ఏర్పాటుచేసిన జెండా స్తంభాలు తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషం తెలిసిందే.