Home » Madhav
ఏపీలో కూటమి నేతృత్వంలో మంచి పాలన జరుగుతోందని మాధవ్ తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలిపారు.
తెలుగు భాషలో జాతీయ కవులు లేరా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతీయ స్థాయి కవిగా జాషువా గుర్తుకు వస్తారని మాధవ్ తెలిపారు. ఆయన గబ్బిలం పేరుతో రచనలు చేస్తే.. దాని గురించి దేశ నలుమూలలను ప్రస్తావించారని గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
మగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.
జాతీయవాదం లేని గ్రామం లేదు. బీజేపీ వాసన లేని వీధి లేదు. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్..
AP Telangana BJP Chiefs: ఏపీ, తెలంగాణలో బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మాధవ్, రామచందర్ రావుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు.
మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.