Home » Madhav
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ లేఖ రాశారు. అందులో హోం గార్డులు పడుతున్న ఇబ్బందులతోపాటు నెల్లూరు, బాపట్లలోని తీర ప్రాంతాల్లోకి తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడ్ బోట్లతో తరలి వచ్చి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు.
అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందని ఏపీ పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాధవ్ పాల్గొన్నారు.
రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.
ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులతో ప్రత్యేకంగా సంతలు, రైతు బజార్లు ఏర్పాటు చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. కేంద్రం అమలు చేసే పథకాల గురించి అందరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్లకు నాడు వాజ్పేయి సహకారం అందించారని గుర్తుచేశారు.
ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు ఉంటాయని అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు.