Home » Lok Sabha
పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టడంలో విపక్ష నేత విఫలమయ్యారని రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. ప్రధాని రాజీ పడ్డారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
లోక్సభ స్పీకర్ అంటే ఇంతకు ముందు తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ రుణాలు కింద మొత్తం రూ.31,34,807 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం లోక్సభలో డీఎంకే సభ్యుడు రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...
ఎప్స్టీన్ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు.
డాలర్ ఆధిపత్యంపై కొన్ని దేశాలు పోరాడుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా ఆధిపత్యానికి పలు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. ఇంధన, ఆర్థిక రంగాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.