Home » Latest News
రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
నటుడు ప్రకాష్రాజ్ చేసిన ట్వీట్పై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రకాష్రాజ్, జోసెఫ్ రావణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ప్రకాష్రాజ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త శనివారం హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు.
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు. ఓ వైద్యురాలి మృతి కేసులో ఆయన దోషిగా తేలడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో బంగారు గనుల అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని, టీటీడీ నిధులతో ఆలయాల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మైగ్రేన్, రక్తహీనత రెండూ చాలా మందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యలు. అయితే ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు, మైగ్రేన్ తలనొప్పికి మధ్య సంబంధం ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.