Home » Latest News
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత మావిగన్పై చెప్పే మాటలు నిలకడలేనివని ఎద్దేవా చేశారు.
అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రముఖ పాండవాణి ఫోక్ సింగర్ తీజన్ బాయి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
పాకిస్థాన్ లాహోర్లో ఇద్దరు విదేశీ మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మనవడు రజా దార్ పాత్ర ఉన్నట్టు స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరిని ప్రారంభిస్తామని తెలిపారు.
పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య, ఆయన కుమార్తె రామాంజమ్మ వారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.