Home » Latest News
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్లాడుకోవటం చూస్తుంటాం. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కదులుతున్న రైలులో ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటు గల్లంతైన ఘటన చాలా బాధాకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మత్స్యకారులు గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పిన వెంటనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 గురించి వివరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వరంగల్ పర్యటనకు వెళ్తుండగా భువనగిరి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్లో హరియాణా పోలీసులు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో దోపిడీ కేసుకు సంబంధించిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.
గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు.
ఇరాన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.