Home » Latest News
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. అయితే, అంతర్జాతీయ టీ దినోత్సవం ప్రాముఖ్యం ఏమిటి? రోజూ తాగే టీ ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? అనే విషయాలను తెలుసుకుందాం..
బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి తలకు ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పని ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నాడనే సమాచారం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 గంటల నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నియమించింది.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి.. వ్యూహా రచన, పథకం అమలు అంతా పాకిస్థాన్ కేంద్రంగానే సాగిందనేందుకు బలమైన సాక్ష్యాలతో బహిర్గతం చేసింది.
వైసీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
పాతబస్తీ మదీనా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లో ప్రధాని మోదీ పర్యటించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం ఆచరించి.. ఈ పుష్కరాలను ప్రారంభించారు.
ఆసిఫాబాద్లో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా బాలికను సురక్షితంగా బయటకు తీశారు.