Home » Latest News
నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశ ప్రయోజనాలు, ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మియాపూర్లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గదిలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, దర్యాప్తులో ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.
వేసవిలో ఐస్క్రీమ్ తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఐస్క్రీమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది.
టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రాధాన్యం మరింత పెరిగింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించారు.
మహిళలపైన నేరాలను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక తల్లి పేట్ బషీరాబాద్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు.