Home » Latest News
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మహాత్మా గాంధీని సాధారణంగా విగ్రహాలు, స్మారక చిహ్నాల ద్వారా స్మరించుకుంటాం. కానీ శ్రీకాకుళంలోని శాంతినగర్లో ఉన్న గాంధీ మందిరం మాత్రం ప్రత్యేకం.
హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది.
హ్యూస్టన్లో తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్లో జరిగిన కార్యక్రమాల్లో సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని, వ్యవస్థాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు.
తులసి ఆకులు ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా భావిస్తారు. అయితే వీటిని వ్యాధులకు ప్రత్యామ్నాయ చికిత్సగా భావించకూడదు. తులసి వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం..
కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. జాతీయ జెండా మన ఐక్యతకు చిహ్నం.. భవిష్యత్కు మార్గదర్శకమని తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,894 కోట్ల ఆదాయం వచ్చిందని జీఎం సందీప్ మాథుర్ వెల్లడించారు. 32 వేల మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.3,300 కోట్ల ఆదాయం పొందిందని వివరించారు.
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.