Home » Latest News
నేటి ఉద్యోగ జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఎక్కువసేపు పని చేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమను వ్యక్తపరచడానికి బహుమతులు ఇవ్వడం ఒక అందమైన సంప్రదాయం. అయితే కొన్ని వాస్తు, సంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను జీవిత భాగస్వామికి లేదా ప్రేమించే వ్యక్తికి బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు.
నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్పై కాల్పుల ఘటన కలకలం రేపింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన బొంగులూరు గేట్ సమీపంలో చోటుచేసుకుంది.
కరీంనగర్లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.