Home » Latest News
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది.
వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు.
తెలంగాణ పర్యాటక సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తృణమూల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.
అమెరికా గడ్డపై పుట్టిన వారంతా తమ దేశ పౌరులేనంటూ యూఎస్ సుప్రీం కోర్టు స్పష్టం చేసి.. ట్రంప్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలను కొట్టిపారేసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిస్థితులు మళ్లీ నిప్పుల కుంపటిలా మారాయి. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ చెలరేగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మరోసారి పతాక స్థాయికి చేరాయి.