Home » KTR
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించామని తెలిపారు.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. గతంలో ఆర్డినెన్స్పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి అహంభావం వల్ల మెట్రో రైల్ రూపంలో తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం లేకపోయిందని..
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తారంటూ కామెంట్స్ చేశారు.
కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో వారిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని... రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.