Home » KTR
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం భారీగానే ఉంటుందని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. దొంగ ఓట్లు 5 రకాలుగా ఉంటాయని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లను బయటపెడుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని కేటీఆర్ ఆక్షేపించారు.
తాను అవకాశవాది కాదు.. అని అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని అని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్లో చేరమని నన్ను ఎవరు అడగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో దళిత వర్గాలకు చోటులేదని విమర్శించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ను 37శాతం ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఫోన్ టాపింగ్ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని సవాల్ విసిరారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కొద్దిసేపట్లో సిట్ విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తోపాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.