Home » KTR
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదంటూ.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఆల్మట్టిని అడ్డుకునే దమ్ముంటే రాహుల్ గాంధీతో చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తును అడ్డుకోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. గతంలో ఆర్డినెన్స్పై గట్టిగా హెచ్చరించిన పులి మాజీ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి అహంభావం వల్ల మెట్రో రైల్ రూపంలో తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎల్ అండ్ టీ తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం లేకపోయిందని..
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తారంటూ కామెంట్స్ చేశారు.
కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో వారిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని... రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.