• Home » KonaSeema

KonaSeema

సమన్వయంతో పరీక్షల సక్రమ నిర్వహణ: డీఆర్వో

సమన్వయంతో పరీక్షల సక్రమ నిర్వహణ: డీఆర్వో

ఇంటర్మీడియట్‌ పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధి కారి జె.వెంకటరావు సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వ హణపై గురువారం కలెక్టరేట్‌లో రెవె న్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్‌, విద్యుత్‌, ఆర్టీసీ, పోస్టల్‌, ఇతర శాఖల అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ సమావేశం నిర్వహించా రు.

విద్యావికాసం దిశగా..

విద్యావికాసం దిశగా..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం తోపాటు విద్యావికాసం దిశగా పాఠశాలలను నడిపించేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. దీనికిగానూ మౌలిక వసతుల కల్పనకు పాఠశాలల్లో ఇప్పటివరకూ జరిగిన నిధుల వినియోగం, చేపట్టిన పనులు ఏవిధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి, ఇంకా మిగిలిన పనులకు ఎంతమేరకు నిఽధులు కావాల్సి ఉందో ఏపీ సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌ అకౌంటబిలిటీ ట్రాన్స్‌ఫెరెన్సీ (ఏపీశాట్‌) ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా విద్యలో ప్రగతి సాధించేందుకు అమలుచేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకుంటోంది.

టెన్త్‌లో అత్యున్నత ఫలితాలకు ప్రేరణ

టెన్త్‌లో అత్యున్నత ఫలితాలకు ప్రేరణ

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రేరణ తరగతులు నిర్వహించాలని డీఈవో షేక్‌ సలీంబాషా పేర్కొన్నారు. ముమ్మిడివరం శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక విద్య ప్రేరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు.

 శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌లో పూడిక చేపట్టాలి

శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌లో పూడిక చేపట్టాలి

శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌కు పూర్తిస్థాయిలో డ్రెడ్జింగ్‌ పనులు చేపడితే మురుగునీరు నేరుగా కేశవదాసుపాలెం వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు.

పదో తరగతి విద్యార్థులకు వీడియో పాఠ్యాంశాలు

పదో తరగతి విద్యార్థులకు వీడియో పాఠ్యాంశాలు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడంతో పాటు పాఠ్యాంశాలకు పట్టు సాధించే విధంగా ప్రత్యేక వీడియో క్లిప్పింగ్‌లను రూపొందించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా తెలిపారు. నిపుణులైన సబ్జెక్టు టీచర్లు రూపొందించిన వీడియో పాఠ్యాంశాల క్లిప్పింగ్‌లను బుధవారం అమలాపురం జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

 పీఎం సూర్యఘర్‌ పథకంతో మేలు

పీఎం సూర్యఘర్‌ పథకంతో మేలు

విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటినీ సూర్యఘర్‌ వెలుగులతో నింపుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం పీఎం సూర్యఘర్‌ పథకం అమలు తీరు పురోగతిపై నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

ఇంటర్‌ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి కమిటీ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామినేషన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. మార్చిలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను లైన్‌ విభాగాల అధిపతులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి పేపరు లీకేజీలకు, మాల్‌ ప్రాక్టీసులకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.

వారం రోజుల్లో ఆక్వా చెరువుల సర్వే పూర్తిచేయాలి

వారం రోజుల్లో ఆక్వా చెరువుల సర్వే పూర్తిచేయాలి

సముద్ర తీర ప్రాంతంలోని ఆక్వాజోన్‌ ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి వారం రోజుల్లో సర్వే చేసి గుర్తించాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్‌ మ్యాప్‌లతో సహా బృందాలు సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో చెరువులను గుర్తించాలన్నారు.

 గ్రీవెన్స్‌ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

గ్రీవెన్స్‌ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

సమస్యలపై అందించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలతో పాటు స్వర్ణాంధ్ర విజన్‌, రెవెన్యూ సమస్యలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఏఎంసీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

ఏఎంసీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోని (ఏఎంసీ) చైర్మన్‌ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 9 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి