Home » Kollu Ravindra
కల్తీ మద్యం అంటూ కుట్రకు తెరలేపిన ఏ ఒక్కరినీ వదలమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. కుట్రకు పాల్పడ్డ నిందితులు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామన్నారు. శవరాజకీయాల్లో ఆరితేరిన జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
బందరులో తెలుగుదేశం నాయకుల్ని తాను కంట్రోల్ చేస్తున్నా కాబట్టి పేర్ని నాని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం చంద్రబాబు తమకు నేర్పిన క్రమశిక్షణ కారణంగానే తెలుగుదేశం శ్రేణులు సంయమనం పాటిస్తున్నారని వెల్లడించారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
గత జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే.. ఫైన్ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందని ఆరోపించారు.
దుర్గామాతను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.శివకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కగా ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు.
కేంద్రం ఎంటర్ అయ్యాక ఇల్లీగల్ మైనింగ్ ఆపారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే వందల కోట్లు జరిగిన నాటి దోపిడీని రికవరీ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్ను ఇంట్లో కూర్చో పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
‘అనంతపురం అర్బన్లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్హిట్ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు సూచించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.