Home » Kollu Ravindra
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్ను తరిమికొడదామని హెచ్చరించారు.
తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.
తన మన తారతమ్యాలు, విభేదాలు మరిచి క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏసుప్రభువు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని చెప్పుకొచ్చారు.
మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పీపీపీ విధానంపై జగన్ విమర్శల గురించి స్పందించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.
రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవసరాలను సద్వినియోగం చేసుకుందామని, అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశ అవసరాలు తీర్చేలా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్మీట్లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో గనుల సీనరేజీ పాలసీ సరళీకృతం చేస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు కష్టించి పండించిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు.